31 అక్టోబర్, 2020
29 అక్టోబర్, 2020
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 22
అపరిగ్రహము - అస్తేయం
'అపరిగ్రహం'అంటే ఇతరుల వస్తువులు గ్రహించ కుండా వుండటము నాయొక్క భావనలో అది కేవలము వస్తువులతోనే కాదు ఇతరుల నుండి విషయ గ్రహణము కూడా చేయకూడదు, అంటే ఇతరుల భావనలు, అవి అరిషట్ వర్గాలతో కూడుకొని ఉంటాయి కనుక వాటిని కూడా సాధకుడు గ్రహించకూడదు. వారి యొక్క భావాలు మనపట్ల మంచి భావన, మంచి అభిప్రాయము కావచ్చు లేదా ఈర్ష్య ద్వేషాదులతో కూడుకున్నవి కావచ్చు అయితే అవి కేవలము వారు మన పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాలు కావచ్చు, మనలను ఆవిధముగా అర్థము చేసుకోవడము కావచ్చు, వాటిని సాధకుడు తన మనసులో చేరనిస్తే, వాటినుంచి సాధకుడి మనసులో భావ పరంపర పెరిగి పోయి తన యందు కూడా రాగఃద్వేషాదుల అల్లికలు కలుపు మొక్కల లాగా పెరిగి పోయి సార వంతమయిన జ్ఞాన ప్రకాశన్నీ ప్రకాశ హీనము చేస్తాయి. రైతు తన యొక్క పొలములో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు పీకి పారేసి మరల వాటిని పెరగనీయకుండా జాగ్రత్త పడితే అతనికి లభించే పంట అద్భుత ఫలాలను ఇస్తుంది. పండిన పంటను కూడా చీడ పురుగులు పట్టకుండా రైతు ఎప్పుడు అప్రమత్తుడై ఉంటాడో సాధకుడు కూడా ఈ విధమైన సాధనను కొనసాగించాలి. అందుకు సాధకుడికి చెప్పబడిన యమ నియమాదులు పాటించడము వలన శుద్ధ అంతఃకరణం ఏర్పడి దివ్య ఫలాలను పొందగలడు.
కేవలము వస్తువులే కాక ఎప్పుడయితే సాధకుడు ఇతరుల భావజాలమును స్వీకరిస్తాడో అంటే ఆయా విషయాదులందు మనస్సున స్వీకరించినట్లే, వాటితో మనస్సున అనేక భావజాలోత్పతికి కారకుడు అవుతున్నాడు, తన పట్ల విమర్శ కావచ్చు, పొగడ్త కావచ్చు ఆరెండు కూడా ఎవరు అయితే వ్యక్తము చేస్తారో అవి కేవలము వారివే వారి యొక్క మనో భావజాలములే ఆయా మనోభావాలు వారివి మాత్రమే, అవి తన పట్ల అయినప్పటికీ కేవలము అవి వారి యొక్క మనోభావాలుగా పరిగణించి ఆ ఉద్దేశ్యాలను వారికె వదిలి వేయాలి కానీ వారి భావాల పట్ల సాధకుడు తన యందు భావోత్పతి చేసుకోకూడదు, అందువల్ల సాధకుడి మనసు యందు అనేక విషయ పరంపరలకు అవకాశము ఇట్చినట్లే, ఆలా చేసుకొంటే తనవి కానీ భావ జలాన్ని తాను స్వీకరించి నట్లే. తనది కాని విషయము అవుతుంది. తనది కాని వస్తువును తనది గా ప్రతి పాదించడమే అవుతుంది. ఇది అపరిగ్రహము-అస్తేయము అని అనిపించుకుంటుంది. ప్రాపంచికుల మనోభావాలు తన పట్ల కానీ వేరే ఇతర ప్రాపంచిక వ్యవహారములు యందు ఎలా ఉన్నప్పటికీ వాటితో సంగత్వము, భాగస్వామ్యము చేసుకోకుండా తనవి గా చేసుకోకుండా, తనవి గా క్లెయిమ్ చేయకుండా ప్రమాద కార విషయములుగా, అక్కరకు రాని విషయములు గా పరిగణించి వాటిని వదిలి వేయడమే సాధకుడికి పరమ శ్రేయస్కరము. ఇతరుల మనో భావ వికారాలు, కక్కు ( వాంతికి ) వంటివిగా, అసహ్యమయినవిగా భావించి వాటికీ అంటే ఆయా భావాలకు దూరముగా వుండటము సాధకుడి యొక్క ప్రధాన ఆవశ్యకమైన గుణముగా ఉండాలి. ఐతే ఇక్కడ గమనించ వలసినది ఏమంటే అవతలి వారు మన పట్ల విద్వేష పూరితమైన భావాలతో మన యొక్క మనుగడకు గాని దన, మాన, ప్రాణాలకు నష్టము కలిగించే విధముగా ఉంటే మాత్రము ఏమాత్రము సాధకుడు ఆయా విషయముల యందు అశ్రద్ధ చేయకూడదు. ఈ విషయాన్ని మహాభారతము తెలియచేస్తున్నది.
పాండవులు కౌరవుల పట్ల ఎంతో స్నేహశీలతను, బందు ప్రీతితో వ్యవహరిస్తున్నప్పటికీ కౌరవులు మాత్రము పాండవుల యొక్క ప్రతి చర్యను, దురభిప్రాయముతో, ద్వేష పూరితమయిన భావనలతో పాండవుల ప్రతి చర్యను వారి పట్ల జరిగిన అవమానంగా చూస్తు పాండవుల యొక్క దన మాన ప్రాణాలను హరించాలనే భావనలతో వారిని అనేక విధాలుగా వెంటాడారు, మానసికముగా హింసిస్తూ వారి, నైతికంగా కృంగేలా సందర్భము వచ్చిన ప్రతి సారి అడుగు అడుగున వారిని వేధించడమే కాకుండా, ఉద్దేశ్య పూర్వకంగా వారిని అనేక సందర్భాలను కల్పిస్తూ వారిని వివశులను చేసి వారి ని అనేక విధాలుగా పతనము చేయాలనీ దుష్ట పన్నాగాలు ఎన్నో పన్నినారు.
వారి విద్వేష పూరితమయిన చర్యలు పదునాలుగు సంవత్సరాల అరణ్య వాసములో కూడా కొనసాగినాయి. కాబట్టి సాధకులు తాము ఎంత తమ వరకు తాము ఉన్నప్పటికీ తమను ఎవరి దౌర్భల్యాలు వెంటాడుతున్నాయి తెలియదు కాబట్టి నిరంతర అప్రమత్త కూడా అవసరమే. సాధకుడికి ఎవరి పట్ల శత్రు భావము లేనప్పటికీ తన పట్ల ఇతరుల మనస్సులు ఏవిధమయిన దుర్బలత్వముతో తో కూడుకున్నవో తెలియదు అతి సహనము, అతిగా ఓర్పు కూడా ప్రమాద కారి కావచ్చు, కనుకనే శ్రీకృష్ణ పరమాత్మా దుర్మార్గాన్ని అతిగా సహించడము కూడా వాటిని ప్రోత్సహించడమే, వారిలో నీవు ఏమిచేసినా వారి మనస్సులు రాగద్వేషాదులనుండి విడివడవు, వారిని ఉపేక్షించడము వలన వారిని చూసి వారి లాంటి దుర్మార్గులు ఎందరో తయారు అవుతారు కాబట్టి వారిని అరికట్టడము అనివార్యము అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునిడికి హితవు చెప్పాడు. కాబట్టి సాధకుడు ఇతరుల విద్వేషం నుంచి కూడా అప్రమత్తుడు అయి చీడ పురుగులనుంచి పంటను కాపాడు కుంటున్నట్లుగా సాధకుడు తనను తాను కాపాడుకోవాలి.
{ సాధకుడు తన నుండి ఇతరుల నుండి వెలువడే విద్వేష పూరిత భావజాలము నుండి తన యొక్క మనస్సును, తన యొక్క చిత్తమును సదా కాపాడుకొంటూ నిత్యము జాగరూకతో ఉండాలి }
.........ఇంకావుంది.
28 అక్టోబర్, 2020
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 21
జీవుడు - సాధకుడు - సిద్ధుడు
క్షేత్రము - స్థానము
జీవ భ్రాంతి తొలగి స్వస్వరూప దర్శనము ఆత్మ దర్శనమైన యోగి జీవన్ముక్తుడు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతుడు అవుతున్నాడు, అతను సర్వే సర్వత్రా అంతటా ఆ పరబ్రహ్మను మాత్రమే దర్శిస్తున్నవాడు, మాయ తొలగినవాడు, ద్వంద్వము లేనివాడు, అంతటా ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మను చూడగలుగుతున్నవాడు అవుతున్నాడు. ఎలాగంటే భూమి మీద వుండే సమస్త జీవులకు భూ భ్రమణము వల్ల ప్రకృతిలో ఏర్పడే రాత్రి పగలు, ఋతువులు జీవులకు అనుభూతిలో కలవు, జనన మరణ అదే విధముగా సూర్యుని స్థానములో నిలబడి చూస్తే రాత్రి పగలు { చీకటి వెలుగులు } ఋతువులు ఇత్యాదులు వుండవు. అతనికి అంతటా కేవలం అఖండమయిన ప్రకాశము మాత్రమే గోచరిస్తుంది. అదేవిధముగా ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి ఆత్మక్షేత్రము నుండి అంతటా ఆత్మ స్వరూపముగానే దర్శిస్తాడు. ఈ జగత్తు యందు జగత్తుకు ఆధారముగా వున్న, అంతటా నిండి నిబిడీకృతమయిన దివ్య ఆనందస్వరూపుడయినా ఆ పరబ్రహ్మ, పరమాత్మనే దర్శిస్తుంటాడు, ఇతనినే జీవన్ముక్తుడు అంటారు. అతనికి జగత్తు యందు జగత్తును కాంచాడు, జగత్తుకు ఆధారమయిన శుద్ధ చైతన్యాన్ని దర్శిస్తాడు. ఆత్మ దర్శనము పొందిన యోగి వ్యవహారికముగా కనిపిస్తున్నప్పటికీ అతను ఎల్లపుడు ఆత్మస్థానములోనే ఉంటాడు. అంతటా ఆనంద స్వరూపమయిన ఆత్మనే దర్శిస్తాడు.
{ భూ క్షేత్రము నందు జీవుడు కాలము , రాత్రి పగలు, ఋతువులు ప్రకృతిని అనుభూతి చెందుతాడు, సూర్యని నందు నిలబడి చూస్తే కాలానికి అతీతమయిన స్థితి, అఖండమయిన ప్రకాశము, ఆవిధముగానే ఆత్మ యందు స్థితిని పొందినవాడు భౌతిక దృష్టి నశించి జనన మరణ సంసార బంధాలకు అతీతుత మైన స్థితిని పొందుతున్నాడు. }
.....ఇంకావుంది.
27 అక్టోబర్, 2020
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం 20
వ్యష్టి - సమిష్టి
ఒక అవగాహన
సూర్యని నుండి సూర్య రష్మిని ఆయా యంత్ర పరికరములు { సోలార్ యంత్ర పరికరములు } గ్రహించి వాటియొక్క సామర్థ్యము ననుసరించి, వాటిలో పొందపరుచబడిన ఉపయోగ విశిష్టతతో వాటి యొక్క వైవిధ్యమయిన శక్తి తో పనిచేయునో అదే విధముగా చైతన్య స్వరూపుడయిన ఆ పరబ్రహ్మ నుండి జీవులు శక్తిని, చైతన్యమును పొందుతూ ఆయా జీవి యొక్క భౌతిక శరీర, మానసిక, ప్రజ్ఞననుసరించి, వివేకముతో వారి సామర్థ్యముననుసరించి వ్యవహరిస్తున్నారు.
క్రిమి కీటకాదుల యందు, పశు పక్షాదుల యందు, దేవ, దానవల యందు, మానవల యందు , యక్ష, కిన్నర కింపురుషులు ఇత్యాదులందు ప్రకాశిస్తున్నది కూడా ఆ బ్రహ్మ యొక్క చైతన్యమే విలక్షణమయిన పరస్పర వైరుధ్యమైన ఆయా ఉపాధులయందు గల సామర్థ్యము ననుసరించి వారి/వాటి యొక్క వ్యవహారము కలదు.
జగత్తు పట్ల సమిష్టి యొక్క భవనాలే వ్యష్టిలో గోచరము అవుతున్నది. స్ఫురిస్తున్నది. వ్యష్టి బౌతికంగా అంతరిస్తున్నప్పటికీ, వ్యష్టిలో జగత్తు లేకుండా పోయినప్పటికీ, సమిష్టి యొక్క భావనలో జగత్తు యొక్క భావన ఉన్నందున అన్య ఉపాధులకు జగత్తు భాసిస్తూనే వున్నది . సమస్త జగత్తు యథార్థముగా వున్నట్లుగా భాసిస్తున్నది .
సమిష్టి లో జగత్తు యొక్క దృడ భావన వున్నదందున వ్యష్టిలో ఆ భావనే స్ఫురిస్తున్నది. అయితే వ్యష్టి ఈ జగత్తును తన కన్నా భిన్నముగా దర్శిస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు. వ్యవహరిస్తున్నాడు. తనకు మూలము అసమిష్టి యే తనలో భాసిస్తున్న జగత్తు భావన అంతయూ ఆ బ్రహ్మదే అని గ్రహించలేక వున్నాడు. జగత్తుకు గల లేదా పదార్థానికి గల భౌతిక పరిదులు, నియతులు, వృద్ధి క్షయములు తనకు ఆపాదించుకొని లోకమునందు వ్యవహరిస్తున్నాడ, దుఃఖిస్తున్నాడు .
.....ఇంకావుంది.
25 అక్టోబర్, 2020
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 19
విజయ దశమి శుభాకాంక్షలతో.......
తన శరీరము పట్ల వ్యామోహాన్ని, మహా మొహాన్ని కలిగిన వారై , ఇంద్రియ లోలులై, వర గర్వితులై త్రిగుణాలతోను, రాగద్వేషాలతోను, అరిషట్ వర్గాలతోను వ్యవహరిస్తూ, లోక కంఠకులై, అసుర చేష్టలతో జనులను, సాధువులను, స్త్రీలను పీడిస్తు వున్న రావణ, దుర్గమాసురాది రాక్షసుల ఫై కలిగిని విజయమే విజయదశమి.
దుర్గమము అంటే కొన్ని పర్యాయ పదాలు కోట, పురము, శరీరము, జయింప శక్యము కానిది, కఠినమయిన త్రోవ, దాట శక్యము కానిది మొదలగునవి ఆయా సందర్భాలననుసరించి వాడుతుంటారు. ఇక్కడ శరీరము అని తీసుకుంటే, ఈ శరీరము జడము, ఇది జడ ప్రకృతి, ఈ జడ ప్రకృతినే 'మాయా' అంటారు, ఈ మాయ జయింప శక్యము కానిది. జయించుటకు అతి దుర్లభమయినది, అత్యంత కఠినమయినది. జీవుడు తాను ధరించిన శరీరము పట్ల మహా మోహముతో ఉంటాడు. సత్వ రజస్తమోగుణాలతోను, 'రాగద్వేషాలతో', అరిషట్వర్గాలతోను వ్యవహరిస్తుంటాడు. ఈ విధముగా భౌతిక జగత్తుతో తాను నెరపే ప్రతి వ్యవహారమునకు కారణము తన పట్ల తనకు వున్నబంధమే, ఈ మాయయే, ఈ మోహకారణమే జన్మ పరంపరలకు దారితీస్తున్నది. కనుక ఈ విధమమయిన సంసార చక్రమును జీవుడు దాటుకోవాలంటే తన పట్ల తనకు వున్న ఆ మాయా మోహము నశించాలి, ఆ మోహము నశించటం అత్యంత దుర్లభమయిన, కఠినతరమయినదిగా వున్నది. ఈ మహా మాయ పట్ల, మాయా మోహముపట్ల కలిగిన జయమే విజయ దశమి.
ఈ కఠినమయిన, దుర్లభమయిన జయింప శక్యము కానిదిగా అగుపిస్తున్న ఈ మాయా మొహాన్ని అత్యంత సులభతరమయిన బోధ, ఆది గురువుగా ఆ పరమేశ్వరుడే సమస్త మానవాళికి అనుగ్రహించాడు. అనుకుంటా. కాశీ క్షేత్రములో కాశి విశ్వేశ్వరుని, విశ్వనాథుని దర్శించినవారు తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటారు. అంతే కాదు కాశీ క్షేత్రములో తనువు చాలించిన వారికి ముక్తి లభిస్తుంది అని స్థల పురాణము చెపుతుంది. ఇక్కడ తమకు అత్యంత ప్రీతి పాత్రమయినది వదిలి వేయమంటే, చాల మంది తమకు ఇష్టమయిన పండ్లు, కూరగాయలు, ఇంకా అనేకమయిన పదార్థాలు వదిలి వేస్తుంటారు, ఆలా చేస్తే ఇంద్రియ లోలత్వము నుండి బయట పడే ఒక అద్భుత సాధన అయ్యివుండవచ్చు. కానీ నా యొక్క భావనలో ఇవన్నీ కాదు, ఇక్కడ కొంత విశ్లేషించుకొంటే ప్రతి జీవికి అత్యంత ప్రీతి పాత్రమయినది ఏది అంటే తన యొక్క తనువు, తన శరీరమే ఈ జగత్తులో తనకు అత్యంత ప్రీతి పాత్రమవుతుంది. దాని పట్ల అత్యంత వ్యామోహాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ వదిలివేయడమంటే తాను ఈ శరీరము అన్న భావాన్ని వదిలి వేయడమే. నేను ఈ శరీరము కాదు అన్న శరీర భావాన్ని ఎప్పుడయితే వదిలివేస్తాడో అప్పుడే అతని అహంభావము తొలగి శుద్దుడు అవుతాడు. అతను సమస్త మానసిక బంధాలు తొలగుతాయి. ఆయా బందాలనుండి విముక్తుడ అవుతాడు. తనువుని ఆధారము చేసుకొని అనేక మానసిక బంధాలు ఏర్పడ్డాయి, అవి లత లాగ జీవుడిని అల్లుకొన్నాయి. బందితుడిని, వాటికీ కట్టు బడేటట్టుగా బద్ధుడను చేశాయి.
ఇంకా కాశీ క్షేత్రములో మరణించిన వారికి మోక్షము లభిస్తుంది అంటారు, మరణానంతరము. అయితే ఇక్కడ శరీరము ఉండగానే నేను ఈ శరీరము అన్న శరీర భావనను త్యజిస్తే, మోహము వదిలితే తన పట్ల తనకు వున్న వ్యామోహము పోతుంది. అప్పుడే సమస్త బందాలనుండి విడివడుతాడు. ఆయా బందాలనుండి ముక్తుడు అవుతాడు. బ్రతికి ఉండగానే జీవన్ ముక్తుడు అవుతాడు. విజయుడు అవుతాడు.
విజయ దశమి శుభాకాంక్షలతో......
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 23
పరమాత్మా వైపా! ప్రపంచము వైపా ! కురు పాండవ సంగ్రామము నిశ్చయమయినాక కౌరవులనునుడి దుర్యోధనుడు, పాండవులనుండి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మాను సహాయ...
శాంతి నేలకోనుగాక !
-
"కనులు చూచును గాని గ్రహీయింపలేవు. కర్నముల్ విను చున్న వేగాని తాము వినజాలకున్నవి యిదమిత్థరవము ! మా కిష్ట మున్నను లేక పోయినను మా శర...
-
HAPPY VIJAYA DASHAMI 2012 YA DEVI SARVA BHUTESU MAATRU RUPENA SANSTHITHA NAMASTASAI NAMASTASAI NAMASTASAI NAMO NAMAH YA DEVI S...
సర్వేజనః సుఖినో భవంతు
అహం బ్రహ్మసి
Peace
May all people be happy
May all people be happy
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
SRI PADAVALLABHA
SRI PADA RAJAM SHARANAM PRAPADYE
NEE JEEVITANIKI
SUVISHALAM IDAM VISWAM
SRI GURU RAGHAVENDRA
SRI RAMAKRISHNA PARAMA HAMSA
JAI GURU DATTA
SRI GURU DATTA
JAI GURU DATTA
Trident
Trident
