శ్రీ రామ
ఆత్మీయ బంధువులకు ఆత్మీయ ఉత్తరం - 9
26-04-2017
ఆత్మీయ బంధువులయిన మీరందరు పరమాత్ముని యోక్క దివ్య ఆనందస్వరూపమును తెలుసుకొంటుంటారని భావిస్తూ
లోకములో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లల అమాయకత్వమును, పిల్లల నిష్కల్మష హృదయాలను చూసి సంబర పడిపోతుంటారు, వారు తడబడుతూ నడుస్తుంటే ఎంతో అబ్బురపడతారు, వచ్చిరాని మాటలకు మురిసిపోతుంటారు, తెలిసి తెలియని మాటలకు నవ్వుకుంటుంటారు, వారి ఆట పాటలను ఆనందంగా తిలకిస్తారు, వారి శారీరిక మానసిక ప్రక్రియ అలావుంటుంది, ఐతే వారు తమ పిల్లలు ఎప్పుడు అలాగే వుండాలని ఎవరూ అనుకోరు, వాళ్ళు ఎదగాలని అన్నివిషయాలు తెలుసుకోవాలని ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా వారి వారి జీవితాలను గడపాలని కోరుకుంటారు, శారీరికంగా మానసికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, ఆశిస్తుంటారు అలాగే లౌకిక విద్యలను బోధించేవారు కూడా లౌకిక ప్రపంచపు విద్యలను తమ విద్యార్థులకు బోదిస్తుంటారు, ప్రజాపాలకులు తమ దేశములోని ప్రజలు అభివృద్ధి చెందాలని పాలకులు భావిస్తారు, అందుకు తగినవిధంగా ప్రణాళికలు రచన చేసి అమలు చేస్తారు.
జగద్గురువు ఆదిశంకరాచార్య వారు తమ శిష్యులను లోకానికి జ్ఞాన దీపాలుగా సత్యప్రకాశకులుగా మానవాళికి సత్యమార్గ భోదకులుగా ఈ లోకానికి అందించారు సామాన్య ప్రజలు ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి దోహదపడుతున్నారు, అలాగే ఆ పరమాత్మ జ్ఞానము కలిగిన భక్తుల కంటే అమాయకపు భక్తులంటే పరమాత్మకు ఎంతో ఇష్టము వారిని తొందరగా అనుగ్రహిస్తాడు కూడా అయితే ఆయా భక్తులు ఏమితెలియని అమాయకపు భక్తిలోనే ఉండాలని అనుకోడు, వారికి సరిఅయిన జ్ఞానము పొందడానికి తన గురించి పూర్తిగా అతను దివ్య మార్గమును పొందాలని స్వయముగా తానే జగద్గురువుగా, సద్గురువుగా త్రిమూర్తి రూపంగా, ఆ దత్త మూర్తి తన భక్తులకు తన యొక్క జ్ఞాన స్వరూపమును బోధిస్తాడు, ఆ భగవంతుని గురించి తెలుసుకొనే కొద్ది భక్తి కూడా పెరుగుతుంధి తన శిష్యుడను ఆ పరమాత్ముని దివ్య స్వరూపములో, దివ్యానందములో నిలిచేటట్టు అనుగ్రహిస్తాడు ఉద్ధరిస్తాడు, అది ఆ పరమాత్మ తన భక్తులకోసం శరీరాన్ని ధరించి సద్గురువుగా, భక్తుల, శిష్యుల హృదయములో జ్ఞానదీపంగా వెలుగొంది అజ్ఞానాంధకారమును తొలగించి అమృత జ్ఞానమునింపుతాడు. సద్గురువు యొక్క అనుగ్రహముతో మన అందరి హృదయాలలో అజ్ఞానమనే చీకటి తొలగి సత్యదీపము వెలగని అని భావిస్తూ.
ఇట్లు
మీ ఆత్మీయ బంధువు.
( ఈ ఉత్తరము చదివే ప్రతిఒక్కరు ఆత్మీయ బంధువే )
,